
న్యూస్ డెస్క్: మేఘాలయలో సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో కొత్త మలుపు తలెత్తింది. భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్లు ఆరోపణలతో అరెస్ట్ అయిన సోనమ్ రఘువంశీ తాజా విచారణలో కీలకంగా మారారు.
పోలీసుల వివరాల ప్రకారం, సోనమ్ తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం రాజాను హత్య చేయించిందని అనుమానం. కిరాయి హంతకులను ఉపయోగించి ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
తాజాగా ఆమెను అరెస్ట్ చేసిన స్థలం – ఓ దాబా వద్ద చోటు చేసుకున్న పరిణామాలు మరింతగా కలకలం రేపుతున్నాయి. మేఘాలయలోని దాబా యజమాని సాహిల్ యాదవ్ వెల్లడించిన వివరాలు సంచలనం కలిగిస్తున్నాయి.
“రాత్రి ఒంటి గంట సమయంలో సోనమ్ ఏడుస్తూ దాబాకు వచ్చింది. ఇంటికి కాల్ చేయాలంటూ అడిగింది. నా ఫోన్ ఇచ్చాను. ఆమె మాట్లాడిన వెంటనే నాకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చా,” అని యాదవ్ తెలిపాడు.
అమె ఒంటరిగా ఉండటం, భయంతో మానసికంగా గందరగోళంగా ఉండడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పుడు ఈ కేసులో దాబా యజమాని వాంగ్మూలం కీలకంగా మారనుంది. విచారణలో కొత్త ఆధారాలుగా దీనిని పోలీసులు ఉపయోగించే అవకాశం ఉంది.