స్పోర్ట్స్ డెస్క్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వెంటవెంటనే టెస్ట్ ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయమే ఇప్పుడు టీమిండియాలో హాట్ టాపిక్. ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్లకు కూడా ఇది ఓ పెద్ద షాక్గా మారింది.
వారిద్దరినీ హోల్డ్ చేయడానికి బీసీసీఐ చివరిదాకా ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి ఫామ్ విషయమై ఒత్తిడి వచ్చిందన్న ప్రచారం కూడా వెలుగులోకి వచ్చింది.
ఇలాంటి సమయంలో తాజాగా గంభీర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. “ఎవరు ఎప్పుడు రిటైర్ అవ్వాలో నిర్ణయించేది ఆటగాడే. అది వారి వ్యక్తిగత నిర్ణయం. కోచ్, సెలక్టర్ కూడా చెప్పలేరు” అంటూ గంభీర్ స్పష్టం చేశాడు.
తనపై వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూ, ఇంతకాలం జట్టుకు సేవలందించిన వారిని గౌరవించాలన్న మేటర్ని నొక్కి చెప్పారు.
వీరిద్దరి రిటైర్మెంట్ జట్టులో ఖాళీని సృష్టించినా, అదే సమయంలో కొత్తవాళ్లకు గొప్ప అవకాశం అందుతుందని గంభీర్ అన్నాడు. “ఒకరితో గ్యాప్ వస్తే, మరోకరికి వెలుగు లోనవుతుందే తప్ప, టీమ్ ఆగదు” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తున్నాయి.
ఇక బుమ్రా లాంటి స్టార్ బౌలర్ లేకుండానే టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నదని గుర్తుచేసిన గంభీర్, టాలెంట్ ఉన్నవారు ముందుకు వస్తే భారత జట్టు మరోసారి టెస్ట్ల్లోనూ పరిపూర్ణ విజయాలు సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.