Thursday, October 9, 2025
HomeNationalమోడీ, రాహుల్.. ఓటర్లు ఎవరి మాట నమ్ముతారు?

మోడీ, రాహుల్.. ఓటర్లు ఎవరి మాట నమ్ముతారు?

modi-vs-rahul-bihar-election-battle

న్యూస్ డెస్క్: బీహార్‌లో రాజకీయ సమరం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య నేరుగా మాటల యుద్ధం మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ ఇద్దరి నాయకుల ప్రతిష్టాత్మక పోరుగా మారాయి.

రాహుల్ గాంధీ ఇటీవల 22 జిల్లాల్లో ‘ఓటు అధికార యాత్ర’ నిర్వహించి బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేశారు. “ఓటు చోరీ”, “ఆపరేషన్ సిందూర్” వంటి అంశాలతో మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇక మోడీ మాత్రం ప్రజల సంక్షేమ పథకాలను, బీహార్ అభివృద్ధికి తెచ్చిన ₹7,000 కోట్లు ప్యాకేజీని హైలైట్ చేస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల ప్రకారం, మోడీకి గ్రామీణ ప్రాంతాల్లో గట్టి మద్దతు ఉంది. యాదవ, ఈబీసీ వర్గాలపై ఆయనకు ఉన్న ప్రభావం కూడా బలంగా మారింది. మరోవైపు రాహుల్ యువత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు.

పాకిస్థాన్‌పై “ఆపరేషన్ సిందూర్” దాడి, జీఎస్టీ 2.0 సంస్కరణలు, పీఎం కిసాన్, సూర్య ఘర్ వంటి పథకాలు మోడీకి ప్లస్‌గా మారగా, రాహుల్ మాత్రం అవినీతి, కుటుంబ రాజకీయాలపై బీజేపీకి ఎదురుదాడి చేస్తున్నారు.

ఇక సర్వేలు చూస్తే, మోడీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ రాహుల్ యాత్ర తర్వాత సమీకరణాలు మారుతాయా? బీహార్ వేదికగా మోడీ వర్సెస్ రాహుల్ పోరులో గెలుపెవరిది అన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular