
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుస పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూశింది. బుధవారం కోల్కతా నైట్రైడర్స్ (KKR)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో CSK 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆఖరి ఓవర్లో మహేంద్ర సింగ్ ధోనీ తన క్లాసిక్ ఫినిషింగ్ టచ్ చూపి భారీ సిక్స్తో చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గెలుపుతో చెన్నై మూడు విజయాలు ఖాతాలో వేసుకోగా, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు కాస్త సంక్లిష్టమైంది.
కేకేఆర్ టాప్ స్కోరర్లు రహానే (48), రస్సెల్ (38), మనీష్ పాండే (36 నాటౌట్) నిలవగా, చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ నాలుగు కీలక వికెట్లు తీశాడు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం తడబాటు చూపింది. ఐదు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత బ్రెవిస్ (52) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను మలుపుతిప్పాడు.
చివర్లో శివమ్ దూబే (45 నాటౌట్), ధోనీ జోడీ స్థిరంగా ఆడుతూ స్కోరు చేర్చింది. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన దశలో ధోనీ మొదటి బంతికే సిక్స్ బాది మ్యాజిక్ చూపాడు. తర్వాత అన్షుల్ కంబోజ్ బౌండరీ బాది గెలుపును ఖరారు చేశాడు.