
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం థగ్ లైఫ్ జూన్ 5న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ రూ.130 కోట్లకు సొంతం చేసుకుంది. రిలీజ్కు ముందు కుదిరిన ఈ డీల్ నిర్మాతలకు బాగా ఉపశమనం కలిగించినప్పటికీ, సినిమా ఫలితం తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
మూవీకి ఆశించిన రెస్పాన్స్ రాకపోవడంతో, నెట్ఫ్లిక్స్ ఒప్పందాన్ని రివైజ్ చేసింది. తొలుత 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అనగా, ఇప్పుడు 4 వారాల్లోనే రానుంది. అదే సమయంలో డీల్ మొత్తాన్ని రూ.110 కోట్లకు తగ్గించాలని నిర్ణయించింది.
ఈ కోత వల్ల మణిరత్నం, కమల్ హాసన్కు రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. వారు నిర్మాతలే కావడంతో నేరుగా ఆ ప్రభావం ఎదురయ్యింది.
జులై మొదటి వారంలో థగ్ లైఫ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఓ వైపు సినిమా ఫ్లాప్ అయినా, స్టోరీలోని ఎమోషనల్ ఎలిమెంట్స్ ఓటీటీలో కనెక్ట్ అవుతాయేమో చూడాలి.