
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హను మాన్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన ఈ సినిమాతో తెలుగు సూపర్ హీరో యూనివర్స్కు నాంది పలికిన ప్రశాంత్, ఇప్పుడు దాని సీక్వెల్ జై హనుమాన్ పై పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి టైటిల్ రోల్లో కనిపించబోతుండడంతో, ప్రాజెక్ట్పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మించబోతున్నట్టు ప్రకటించగా, ఇప్పుడు మరో బిగ్ అడిషన్ ఫైనల్ అయ్యింది.
లేటెస్ట్గా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్కు జాయిన్ అయ్యారు. టీ సిరీస్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జై హనుమాన్ సినిమాను సమర్పించబోతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. ఇది సినిమా బిజినెస్ పరంగా పెద్ద బూస్ట్గా మారనుంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైత్రి మేకర్స్ నిర్మాణంలో, భూషణ్ కుమార్ సమర్పణలో రాబోతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.