
తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు వెలికితీయడమే లక్ష్యంగా జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ పనిచేస్తోందని, నోటీసులపై బీఆర్ఎస్ ఉలికిపాటుకు గురవుతుండటం ఆశ్చర్యకరమన్నారు.
హైదరాబాద్లో మంత్రి సీతక్కతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ, కమిషన్ను తప్పుబట్టడం ద్వారా బీఆర్ఎస్ అసలు ఉద్దేశాలు బహిర్గతమవుతున్నాయని విమర్శించారు.
గతంలో ఇందిరాగాంధీ వంటి ప్రముఖులూ విచారణలకు హాజరయ్యారన్నారు. మేడిగడ్డ వద్ద బాంబులు పెట్టారని బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై స్పందించిన ఆయన, నిజంగా బాంబులు ఉంటే అప్పట్లో FIRలో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
డీపీఆర్లో సూచించిన ప్రదేశం కాకుండా ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మారుస్తూ వ్యయం పెంచారని ఆరోపించారు.
కాళేశ్వరం తెల్ల ఏనుగుగా మారిందని కాగ్, ఎన్డీఎస్ఏలు నివేదికలలో పేర్కొన్నాయని గుర్తుచేశారు. డీపీఆర్, రీడిజైన్, నిర్మాణం అన్నింటిలోనూ లోపాలే కనిపిస్తున్నాయని తెలిపారు.
ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తేవాలన్న దిశగా ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని పేర్కొంటూ, కమిషన్ ముందు హాజరై వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.