
సమంత రాజ్ నిడిమోరులు డిసెంబర్ 1, 2025న వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కోయంబత్తూర్లోని ఈషా యోగ సెంటర్లో లింగ భైరవి అమ్మవారి సాక్షిగా భూత శుద్ధి ఆచారంలో వీరి వివాహం జరిగింది.
తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, చేతికి పెట్టుకున్న వెడ్డింగ్ డైమండ్ రింగ్ను హైలెట్ చేసింది. ఈ రింగ్ ప్రత్యేకత ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఈ రింగ్ పోట్రైట్ కట్ డైమండ్ రింగ్ అని జ్యువెల్లరీ వ్యాపారి అభిలాష బండారి వెల్లడించారు. ఈ డిజైన్ మొఘలుల కాలంలో ఎక్కువగా వాడుకలో ఉండేదట. ముఖ్యంగా తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ భార్య ముంతాజ్కు ఇలాంటి తరహా ఉంగరాలు చాలా ఇష్టం ఉండేదని చరిత్ర చెబుతుంది.
ఈ డైమండ్ రింగ్ తేజస్సు, బలం స్వచ్ఛమైన స్వభావానికి ప్రతీకగా పిలుస్తారు. ఇలాంటి వెడ్డింగ్ రింగులు ఈ జనరేషన్ లో చాలా అరుదుగా తయారు చేస్తారు.
ఈ వెడ్డింగ్ రింగ్ కాస్ట్ దాదాపు ₹1.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. గతంలో కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా, అలియా భట్ వంటి సెలబ్రిటీల రింగుల కంటే సమంత డిజైన్ చాలా వెరైటీగా ఉంది.
