Friday, September 5, 2025
HomeUncategorizedరాజగోపాల్ రెడ్డి షాకింగ్ నిర్ణయం: అసెంబ్లీకి దూరం

రాజగోపాల్ రెడ్డి షాకింగ్ నిర్ణయం: అసెంబ్లీకి దూరం

raj-gopal-reddy-no-more-assembly-attendance-after-today

తెలంగాణ: కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు బహిర్గతమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోనని సంచలన ప్రకటన చేశారు. ఈరోజు సమావేశాలకు హాజరైన అనంతరం గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

అమరవీరుల స్థూపం తమకు గుడితో సమానమని, అక్కడికి రావడానికే ప్రత్యేక కారణాలు అవసరం లేదని చెప్పారు. ఈ రోజు తర్వాత శాసనసభలో అడుగుపెట్టే ఆలోచన లేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్కనే ఉండాలని తన ధ్యేయమని తెలిపారు. తన అనుచరులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు భరోసా ఇస్తానని ప్రకటించారు.

అయితే ఆయన నిర్ణయానికి వేరే కారణాలున్నాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. తనకు మంత్రి పదవి రాకపోవడం, మునుగోడు నియోజకవర్గానికి నిధులు సక్రమంగా కేటాయించకపోవడంపై ఆయన చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. రీజనల్ రింగ్ రోడ్డు రైతుల అంశంలో కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది. రాజగోపాల్ వ్యూహం వెనుక దాగి ఉన్న రాజకీయ లెక్కలు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఈ నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు మరింత ముదురే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular