
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమా ‘కే-ర్యాంప్’ ప్రమోషన్లో కొత్త పంథా చూపిస్తున్నాడు. సాధారణంగా హీరోలు సినిమా రిలీజ్ ముందు ప్రెస్ మీట్స్, ఫంక్షన్లతోనే బిజీగా ఉంటారు.
కానీ కిరణ్ మాత్రం ఈసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను టార్గెట్ చేశాడు.
ఏ నగరానికి వెళ్లినా, స్థానిక ఇన్ఫ్లుయెన్సర్స్తో చిట్చాట్ నిర్వహిస్తూ మూవీ గురించి మాట్లాడుతున్నాడు.
ఈ ఆలోచన ఇప్పటి వరకు టాలీవుడ్లో ఎవరూ ప్రయత్నించని కొత్త స్ట్రాటజీగా మారింది. ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు వైరల్ అవుతుండడంతో ‘కే-ర్యాంప్’కు బజ్ పెరుగుతోంది.
యూత్ను నేరుగా కనెక్ట్ చేసే ఈ ప్రమోషన్ పద్ధతితో కిరణ్ అబ్బవరం దృష్టిని ఆకర్షించాడు. అభిమానులు కూడా ఈ కొత్త ఆలోచనను ప్రశంసిస్తున్నారు. సినిమాను కొత్త పంథాలో ప్రమోట్ చేయడం మంచి ఫలితాలను ఇవ్వవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
