విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన ‘కింగ్డమ్’ ఈ ఏడాది టాలీవుడ్లో హాట్ టాపిక్గా నిలిచింది. థియేటర్స్లో గ్రాండ్ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం, విజయ్ కెరీర్లో మంచి వసూళ్లు సాధించింది.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్ డ్రామా, అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేట్రికల్ రన్ చివరి దశలోకి చేరుకుంటున్న వేళ, ఇప్పుడు ఓటిటి రిలీజ్ గురించి చర్చ మొదలైంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులు ఇప్పటికే నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. తాజాగా, ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందన్న వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
బజ్ ప్రకారం ‘కింగ్డమ్’ ఆగస్ట్ 28 లేదా 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
అనిరుద్ రవిచందర్ సంగీతం, నాగవంశీ – సాయి సౌజన్యల నిర్మాణం ఈ చిత్రానికి హైలైట్ అయ్యాయి. థియేటర్స్లో హిట్ అయిన తర్వాత, డిజిటల్లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతుందేమో చూడాలి.
ప్రేక్షకులు, ముఖ్యంగా విజయ్ అభిమానులు, ఓటిటిలో ‘కింగ్డమ్’ని మళ్లీ చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డేట్ కన్ఫర్మ్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ తప్పదనే చెప్పాలి.
