
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమాపై తెలుగులో భారీ హైప్ నెలకొంది. ఆగస్ట్ 14న పాన్ ఇండియా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి తెలుగులో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
తాజాగా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఏషియన్ సునీల్ నారంగ్, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ హక్కులను దక్కించుకున్నారని టాక్. రేటు రూ.48 కోట్లకు పైగా ఉండొచ్చని తెలుస్తోంది.
ఇది గట్టిగా చెప్పాల్సిన విషయం ఎందుకంటే, జీఎస్టీ కాకుండా ఇది కేవలం నెట్ థియేట్రికల్ విలువ. ఇటీవలి కాలంలో తమిళ సినిమాకు తెలుగులో వచ్చిన భారీ డీల్ ఇదేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కూలీ ఫస్ట్ సింగిల్ కూడా త్వరలో విడుదల కాబోతుండటంతో ప్రమోషన్ మూడ్ షురూ అయింది. అనిరుధ్ మ్యూజిక్, రజినీ స్టైల్ మాస్ సాంగ్తో అభిమానుల్లో జోష్ పెంచనుంది.
ఈ మూవీలో నాగార్జున విలన్గా, శృతి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించనుండగా, ఆమిర్ ఖాన్ ప్రత్యేక రోల్ చేయనున్నట్లు టాక్ ఉంది. తెలుగులో జైలర్ తర్వాత మరోసారి రజినీ రికార్డులు తిరగరాయనున్నారనే అంచనాలు భారీగా ఉన్నాయి.