fbpx
Wednesday, June 18, 2025
HomeTelanganaఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. టోనీ బ్లెయిర్‌తో కీలక భేటీ

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. టోనీ బ్లెయిర్‌తో కీలక భేటీ

cm-revanth-reddy-delhi-visit-tony-blair-meeting

తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రాత్రి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సమయంలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నట్లు సమాచారం.

ఈ పర్యటనలో ప్రముఖ నేతలు, కేంద్ర మంత్రులతో పాటు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ను కూడా కలవనున్నారు. ‘టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్’ సంస్థ ద్వారా తెలంగాణలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది.

పారిటీ వ్యవహారాల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ రేవంత్ భేటీ కానున్నారు. పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై ఈ భేటీలో చర్చ జరగనుందని సమాచారం. అలాగే పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకునే వీలుంది.

పలు కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ సమావేశమై రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు, అనుమతులపై వినతిపత్రాలు అందించనున్నారు. పునర్నిర్మాణాలు, మౌలిక సదుపాయాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఇందులో రాష్ట్రానికి పెట్టుబడులు, పార్టీ బలోపేతం అనే రెండు కీలక అంశాలపై రేవంత్ దృష్టి సారించడంతో ఈ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular