
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైవేలపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్ల వాడకదారులు ఇప్పుడు కేవలం రూ.3,000 చెల్లించి ఏడాది పొడవునా 200 ట్రిప్పులు వరకూ టోల్ చార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు. ఫాస్టాగ్ ఆధారిత ఈ ప్రత్యేక వార్షిక పాస్ను మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఈ పాస్ 2024 ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానుంది. పాస్ చెల్లుబాటు కాలం లేదా ట్రిప్పుల లిమిట్ – ఏదైనా ముందుగా పూర్తైతే అది ముగుస్తుంది. తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నెలకు రూ.340 చెల్లించే వాహనదారులకు ఇది రూ.1,000 పైగా ఆదా కలిగించే స్కీమ్.
ఈ పాస్ను రాజ్మార్గ్ యాత్రా యాప్ ద్వారా సులభంగా కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు, టోల్ ప్లాజాల వద్ద నిలిచే సమస్యలు, టైమ్ వేస్ట్లకు ఇది పరిష్కారంగా మారనుంది.
ప్రైవేట్ వాహనాలే ఎక్కువగా ఉదయ వేళల్లో టోల్ ప్లాజాలకు వచ్చేవి కావడంతో, ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకే ఈ ప్లాన్ తెచ్చారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గదు కానీ నిర్వహణ సౌలభ్యం పెరుగుతుంది.
ఈ కొత్త ఫాస్టాగ్ ప్లాన్తో ప్రయాణాలు సాఫీగా, ఎటువంటి ఆలస్యం లేకుండా సాగుతాయనే ఆశను వాహనదారులు పెట్టుకున్నారు.