ఏపీ: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత జవాన్ల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీలో భాగంగా, విజయవాడలోనూ శుక్రవారం ర్యాలీ జరుగుతుంది. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్డీఏ భాగస్వామ్య నేతలకు ఆహ్వానం పంపారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్వయంగా ఫోన్ చేసి ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరగా, పవన్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొననున్నట్టు పురందేశ్వరి తెలిపారు. జాతీయ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు, జవాన్ల త్యాగాలను గుర్తు చేసేందుకు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ స్పష్టం చేసింది.
రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరుగుతున్న ఈ ర్యాలీపై రాజకీయ, ప్రజాసామాన్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తిరంగా పతాకాలతో సాగనున్న ఈ యాత్ర జాతీయత, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.