
తెలంగాణ: రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మలచే ప్రయత్నాలను సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినంగా హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్లో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజే డ్రగ్స్ రాక నియంత్రణపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశానని గుర్తు చేశారు. “తెలంగాణ ఉద్యమాలకు పుట్టినగడ్డ. ఇక్కడ డ్రగ్స్ వ్యాప్తి అవుతే అది మనందరి వైఫల్యం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు స్కూల్ స్థాయినుంచి విశ్వవిద్యాలయాల వరకూ డ్రగ్స్ ముప్పులో పడుతున్నారని రేవంత్ అన్నారు. ఇది దేశ భవిష్యత్తుకు ముప్పుగా అభివర్ణించారు.
శత్రు దేశాలు దేశం బలహీనపర్చేందుకు డ్రగ్స్ను ఆయుధంగా ఉపయోగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇది కొత్త యుద్ధరూపంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
తెలంగాణ సరిహద్దుల్లోకి డ్రగ్స్ రవాణా చేసే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ బతకనివ్వరని అన్నారు. వారిని కఠినంగా ఎదుర్కోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఈ ప్రకటన రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాకు గట్టి సంకేతంగా మారిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.