
స్పోర్ట్స్ డెస్క్: 2026 ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఇప్పటినుంచే వ్యూహం సిద్ధం చేస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15 టీ20ల్లో 13 విజయాలు సాధించిన భారత జట్టు, టైటిల్ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
ఓపెనర్లుగా గిల్, జైస్వాల్ పునరాగమనంతో పాటు అభిషేక్ శర్మ మెరుపులు చూపిస్తున్నాడు. 37 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్చేత కూడా సమర్థతను చూపాడు.
మిడిలార్డర్లో తిలక్ వర్మ రెండు సెంచరీలతో ఆకట్టుకోగా, శ్రేయస్ అయ్యర్ 604 పరుగులు సాధించి తన స్థానం భద్రం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్గా నిలిచిన అతనికి మరింత నమ్మకం లభించింది.
వికెట్ కీపర్గా సంజూ శాంసన్ నిలకడగా రాణిస్తుండగా, రెండో స్థానానికి జితేశ్ శర్మ, జురెల్ పోటీపడుతున్నారు. రాహుల్, పంత్ ఆటతీరు ఆశాజనకంగా లేకపోవడంతో వీరిద్దరికే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్, అక్షర్లు ప్రధానంగా కనిపించనున్నారు. స్పిన్నర్లలో కుల్దీప్, వరుణ్లు స్థిరంగా ఉన్నారు.
పేస్ విభాగంలో బుమ్రా, అర్ష్దీప్లు లీడ్ చేస్తుండగా, హర్షిత్ రాణాకు మూడో స్థానానికి ఎక్కువ అవకాశాలున్నాయి. భారత్కు 18 టీ20ల ద్వారా జట్టు ఎంపికకు సమయం ఉన్నట్లు తెలుస్తోంది.