
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఇంగ్లండ్ పర్యటనకు టెస్ట్ కెప్టెన్గా రోహిత్ను తప్పించబోతున్నారని వార్తలు వస్తున్న కొద్ది గంటల్లోనే అతడి నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే టీ20లకు గుడ్బై చెప్పిన రోహిత్, ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు.
ఈ పరిణామంపై మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘ఆటగాడిగా, కెప్టెన్గా రోహిత్ అద్భుతంగా జట్టును నడిపించాడు. అతని ఆటతీరు, క్రీడా పట్ల చూపిన వృత్తిపరమైన శ్రద్ధ ప్రశంసించదగినది. భారత క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఆటగాళ్లు అరుదు’’ అని కపిల్ కొనియాడాడు.
కపిల్ దేవ్ అభిప్రాయం ప్రకారం, రోహిత్ స్థానంలో సుదీర్ఘ ఫార్మాట్లో మంచి నాయకుడిని కనుగొనడం బీసీసీఐకి సవాలుగా మారనుంది. ‘‘అద్భుత కెరీర్కు వీడ్కోలు పలికిన రోహిత్కు నా శుభాకాంక్షలు’’ అని ఆయన తెలిపాడు.
మరోవైపు, రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతాడా అనే ప్రశ్నపై కూడా కపిల్ స్పందించాడు. ‘‘ప్రతి క్రీడాకారుడి కోరికే సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని. కానీ చివరికి జట్టు ఎంపిక నిర్ణయం సెలక్టర్లదే’’ అని స్పష్టం చేశాడు.