
పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న వార్-2 ట్రైలర్ విడుదలతో ఇండస్ట్రీలో హైపే క్రియేట్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఇద్దరి మధ్య మాస్ పోటీ స్పష్టంగా కనిపించింది.
ట్రైలర్ లో హృతిక్ రోషన్ డైలాగ్స్, ఎన్టీఆర్ పవర్ ఫుల్ ఎంట్రీతో అభిమానులను కట్టిపడేశారు. “నేను ప్రమాణం చేస్తున్నాను” అంటూ హృతిక్ స్టైల్ లో ఎంటర్ అవుతే, “ఎవరూ చేయలేని పోరాటం నేను చేస్తాను” అంటూ తారక్ మాస్ డైలాగ్ అందించాడు. ఇద్దరి మధ్య పోటీ, యాక్షన్ సీక్వెన్స్ లు కొత్త అనుభూతిని అందించాయి.
కియారా అద్వానీ గ్లామర్ అండ్ సీరియస్ లుక్ ఆకట్టుకుంది. ట్రైలర్ లో యాక్షన్, ఎలివేషన్ సీన్స్, గ్రాండ్ విజువల్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెచ్చాయి. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.
ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయగా, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ విడుదల చేస్తున్నారు.
