
తెలంగాణ: రాష్ట్రంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
సూర్యాపేట ఆర్టీసీ డిపోలో నూతన ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.182 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ చేశామని తెలిపారు.
మహిళల ప్రయాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆర్టీసీకి ప్రభుత్వం రూ.6,088 కోట్లు చెల్లించిందని వివరించారు.
కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలు అసత్యమని, ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడం లేదని ఆయన ఖండించారు. బస్సులు నిండుగా నడవడంతో సంస్థకు ఆదాయం పెరుగుతోందన్నారు.
మహిళల భద్రత, సౌకర్యాల కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రతినిత్యం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మహిళా ప్రయాణికుల అభినందనలు సభలో హైలైట్గా నిలిచాయి.