
తెలంగాణ: రాజకీయాలు కల్వకుంట్ల కవిత చుట్టూ మళ్లీ ఉత్కంఠగా మారాయి. బీఆర్ఎస్ నుంచి ఆమె తొలగింపు కీలక నేతలపై కుట్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె వేసుకున్న ఒక సాధారణ సారీ ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు తెరలేపింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకలో కవిత పాల్గొన్నారు. ఆమె ధరించిన ‘ఆఫ్ వైట్ కలర్ సారీ’కి ఎరుపు ఆకుపచ్చ రంగుల బార్డర్ ఉండటం విశేషం. సాధారణ డ్రెస్సింగ్కు భిన్నంగా ఈ రంగుల ఎంపిక జరిగింది.
ఆమె ఎంచుకున్న ఆఫ్ వైట్ (తెలుపు), ఎరుపు, ఆకుపచ్చ కలర్ కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులను పోలి ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే సంకేతమా అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వైదొలిగి, కీలక నేతలపై కుట్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో, కవిత కొత్త రాజకీయ ప్రయాణానికి ఈ కలర్ స్కీమ్ ద్వారా ‘కోడ్ లాంగ్వేజ్’ వాడుతున్నారేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, కవిత ఈ ఈవెంట్కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో కూడా అదే సారీని ధరించారు. అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల కారణంగా ఆమె ఫ్యాషన్ ఎంపికపై సోషల్ మీడియాలో చర్చలు జరిగి, దానికి రాజకీయ అర్థం ఆపాదించారు.
ఒక సారీని కూడా పొటెన్షియల్ పొలిటికల్ స్టేట్మెంట్గా విశ్లేషించడం కవిత రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఆమె స్వంత పార్టీని పెడతారా లేక కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా అనేది త్వరలో తేలనుంది.
