
న్యూస్ డెస్క్: సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలంటూ పాకిస్థాన్ ఎంత విజ్ఞప్తులు చేసినా, భారత్ తన నిర్ణయం వద్దే నిలుస్తుందంటూ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ఒప్పందాన్ని సస్పెండ్ చేయగా, పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ‘రక్తం, నీళ్లు ఒకేసారి ప్రవహించవు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై పాటిల్ ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు. బిలావల్ రాజకీయ లబ్ధి కోసమే ఇలా మాట్లాడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. గతవారం హోంమంత్రి అమిత్ షా కూడా ఒప్పంద పునరుద్ధరణకు నో చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక కిషన్గంగ, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై విచారణను తాత్కాలికంగా నిలిపేయాలని ప్రపంచ బ్యాంకును భారత్ కోరినట్టు సమాచారం. దానికి స్పందన వచ్చేలోపు ప్రక్రియకు విరామం పెట్టాలని కోరారు.
ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన తర్వాత భారత్, పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా నిలిపివేయడం గమనార్హం.