
న్యూస్ డెస్క్: అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీయంగా బంగారం ధర ఒక్కసారిగా పతనమైంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గడమూ, అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలు చక్కదిద్దుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
దీంతో పాటు లాభాల స్వీకరణ కూడా ప్రారంభమవడంతో పెట్టుబడిదారులు బంగారంపై అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఒక్కరోజే రూ.930 మేర ధర తగ్గింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.97,670కి పడిపోయింది.
99.5 శాతం స్వచ్ఛత గల బంగారం కూడా రూ.850 తగ్గి రూ.97,200 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో వెండి ధర కూడా రూ.100 తగ్గి రూ.1,03,000కి చేరుకుంది.
అంతర్జాతీయంగా ఇరాన్ సంయమనం పాటించడంతో ముడి చమురు ధరలు తగ్గాయన్న విషయం కూడా బంగారం పతనానికి కారణమైంది. భయాందోళన లేకపోవడం ధరలపై ఒత్తిడి తీసుకువచ్చింది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తక్షణంలో తగ్గించే సూచనలు లేవన్న పావెల్ వ్యాఖ్యలు కూడా బులియన్ మార్కెట్ను ప్రభావితం చేశాయి. డాలర్ బలహీనతతో పెట్టుబడిదారులు బంగారం నుంచి నిధులను ఇతర రిస్క్ అసెట్స్కి మళ్లిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర $3,284.40కి చేరి 1.31 శాతం తగ్గింది. దీని ప్రభావం భారత్ మార్కెట్లో తేటతెల్లంగా కనిపిస్తోంది.