
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఈరోజు బిగ్ ఫెస్టివల్. ఆయన 50వ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో భాగంగా 2005లో విడుదలై కల్ట్ క్లాసిక్గా నిలిచిన “అతడు” మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ రీరిలీజ్కు భారీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఫ్యాన్స్ ప్రత్యేక షోలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి పండగ వాతావరణం సృష్టించారు. మహేష్ కెరీర్లో ప్రత్యేకమైన ఈ సినిమాను మరోసారి పెద్ద ఎత్తున చూడాలని అందరూ ఉత్సాహంగా ఉన్నారు.
ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో ఈ రీరిలీజ్ హిస్టారిక్ రికార్డ్ సెట్ చేసింది. ఏకంగా 140కి పైగా లొకేషన్స్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న మహేష్ సినిమా ఇదే. ఈ రేంజ్ రీరిలీజ్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకీ జరగలేదు.
మహేష్ సినిమాలకు యూఎస్లో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉండేది. “అతడు” విడుదలైనప్పుడు కూడా అమెరికాలో బాగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు రీరిలీజ్లోనూ అదే క్రేజ్ కనబడుతోంది. ముందస్తు బుకింగ్స్ హౌస్ఫుల్ అవ్వడం ఫ్యాన్ పవర్ను చూపిస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వం, మణిశర్మ సంగీతం, మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ “అతడు”ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. మహేష్ అభిమానుల కోసం ఈ రీరిలీజ్ ఒక గిఫ్ట్ మాత్రమే కాదు, ఆయన స్టార్డమ్ను మళ్లీ నిరూపించే వేడుకగా మారింది.
