fbpx
Thursday, June 12, 2025
HomeSportsమహిళా అంపైర్‌తో అశ్విన్ వాగ్వివాదం.. వీడియో వైరల్

మహిళా అంపైర్‌తో అశ్విన్ వాగ్వివాదం.. వీడియో వైరల్

ashwin-umpire-argument-dindigul-loss

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో దిండిగల్ డ్రాగన్స్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వివాదానికి కేంద్రంగా మారాడు. ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళ్‌తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయిన తీరు వివాదాస్పదమైంది.

ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో సాయి కిషోర్ బౌలింగ్‌లో 18 పరుగులు చేసిన అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, ఈ నిర్ణయాన్ని మహిళా అంపైర్ కృతిక తీవ్రంగా వ్యతిరేకించాడు.

“మేడమ్, బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయింది” అంటూ అశ్విన్ వాదనకు దిగాడు. డీఆర్‌ఎస్ లేని కారణంగా నిర్ణయాన్ని సవాలు చేయలేకపోయాడు.

దీంతో అసహనంగా తన బ్యాట్‌ను ప్యాడ్స్‌కు కొట్టిన అశ్విన్ తీరుపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

దిండిగల్ జట్టు మొత్తం కేవలం 93 పరుగులకు ఆలౌట్ అయింది. తిరుప్పూర్ తమిళ్‌తలైవాస్ 94 పరుగుల లక్ష్యాన్ని 12 ఓవర్లలో చేధించి విజయం సాధించింది.

ఈ విజయం తో తమిళ్‌తలైవాస్‌కు తొలి గెలుపు లభించగా, అశ్విన్ నాయకత్వంలోని దిండిగల్‌కు ఇదే మొదటి ఓటమి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular