
ఆంధ్రప్రదేశ్: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
కొత్త కార్డులు అవసరమున్న వారు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు, సభ్యుల చేరిక లేదా తొలగింపు, చిరునామా సవరణ, కార్డుల విభజన కోసం కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 3.28 లక్షల మంది ఈ మార్పులకు దరఖాస్తు చేసినట్టు తెలిపారు.
అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈసారి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తుందని, అందులో క్యూఆర్ కోడ్తో పాటు ఆరు నెలల రేషన్ వినియోగ చరిత్రను స్కాన్చేసి చూడగల అవకాశముంటుందని తెలిపారు.
గత ప్రభుత్వం మాదిరిగా నేతల ఫొటోలు కాకుండా, అధికారిక చిహ్నంతోనే కార్డులు ఉంటాయని పేర్కొన్నారు.
జూన్ నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని, మే 12 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా దరఖాస్తులను స్వీకరిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.