
తెలంగాణ: హైదరాబాద్లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తనపై సంపన్న స్పాన్సర్లను అలరించాలన్న ఒత్తిడి తెచ్చారని ఆమె చేసిన ఆరోపణలు ఇంగ్లండ్ మీడియా లో హాట్ టాపిక్గా మారాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హుటాహుటిన విచారణకు ఆదేశించింది. సీనియర్ అధికారిణి శిఖా గోయల్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే ఇతర పోటీదారుల వాంగ్మూలాలు నమోదు చేస్తోంది.
అవసరమైన చోట్ల వీడియో ఆధారాలు సేకరించడంతో పాటు మిల్లా హాజరైన ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొన్నవారిపై ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ వివాదంపై దృష్టి సారించింది.
మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. అవి పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా దీనిని ఖండించారు.
ప్రస్తుతం ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నదానిపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. సమగ్ర నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.