
స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు బీసీసీఐ నుంచి ఊహించని షాక్ తగిలింది. మే 23న చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన RCB vs SRH మ్యాచ్ను లక్నోకు మార్చేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
వర్షాభావ సూచనల నేపథ్యంలో మ్యాచ్ వేదిక మార్పు చేపట్టినట్లు తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో మే 17న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అదే పరిస్థితి మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో బీసీసీఐ ముందస్తు చర్య తీసుకుంది. వేదిక మార్పు నిర్ణయంతో బెంగళూరులోని అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకున్న వారిని రీఫండ్ చేయడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ ప్లేఆఫ్స్ రేసులో కీలకం కావడంతో, రెండు జట్లకూ సమానమైన వాతావరణంలో ఆడించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కోల్కతా జట్టు వర్షం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడం బీసీసీఐకి గుణపాఠంగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.