స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ (WTC Finals) నిర్వహణ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాబోయే మూడు ఎడిషన్ల ఫైనల్స్కు ఆతిథ్యాన్ని ఇంగ్లండ్కు అప్పగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. 2027 ఎడిషన్ కూడా ఇందులో భాగమే.
ఇప్పటికే 2021, 2023, 2025 ఫైనల్స్ లండన్లో జరిగాయి. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టెస్ట్ క్రికెట్కు లార్డ్స్ ఓ చారిత్రక కేంద్రమైపోయింది. దీంతో, అదే వేదికపై వరుసగా ఫైనల్స్ చేయాలని ఐసీసీ ఉద్దేశిస్తోంది.
బీసీసీఐ అనేక మార్లు ఆసక్తి చూపించినా, వాతావరణం, ట్రావెల్ హబ్, మైదాన సౌకర్యాల కారణంగా భారత్కు అవకాశం రాలేదు. జై షా ఐసీసీ చైర్మన్గా ఉన్నా కూడా, ఈ నిర్ణయం భారత ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.
ఐసీసీ అధికారికంగా ఈసీబీకి హక్కులు అప్పగించేందుకు వచ్చే నెల సింగపూర్లో జరిగే సమావేశాన్ని ఉపయోగించనుంది. అయితే, 2027 కోసం ఉత్తర ఇంగ్లండ్ వేదికలు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఇది కలిసొచ్చిన విషయం అయినా, భారత్లో వన్డే, టీ20 వరల్డ్కప్లు జరిగినా, డబ్ల్యూటీసీ ఫైనల్ మాత్రం ఇంకా అందని కలగానే మిగిలిపోయింది.
wtcfinals 2027, icc england hosting, bcci test cricket, lords stadium finals, jai shah icc decision,