
న్యూస్ డెస్క్: తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 15 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ పలు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం నుంచే భారీ వర్షాలు తేలికపాటి ఉరుములు, మెరుపులతో మొదలవుతాయని తెలిపింది.
ఉమ్మడి మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ సహా మొత్తం 28 జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్లో ఆకాశం మేఘావృతంగా ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ఠం 23 డిగ్రీలు నమోదయ్యే సూచన ఉంది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణాలు తగ్గించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వర్షాల కారణంగా కలిగే ప్రభావాలపై అధికారులు, ఐఎండీ నుంచి వచ్చే అప్డేట్స్ను ప్రజలు తక్షణమే అనుసరించాలని అధికారులు తెలిపారు.
