
డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి తన మార్క్ మాస్ ఎంటర్టైనర్తో బౌన్స్బ్యాక్ కావాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. ఈసారి తమిళ స్టార్ విజయ్ సేతుపతిని హీరోగా తీసుకుని ఓ ఆసక్తికర ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నాడు.
ఇప్పటికే టబును ఓ ప్రధాన పాత్రకు ఫిక్స్ చేసిన పూరి, తాజాగా బాలీవుడ్ నుంచి మరొక బ్యూటీని కూడా ఎంపిక చేస్తున్నట్లు టాక్ ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన భారీ ఓపెనింగ్ సీన్ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న పూరి, అందుకోసం ప్రత్యేక సెట్ను నిర్మిస్తున్నాడట. ఈ సీక్వెన్స్ను జూన్లో షూట్ చేయనున్నారు. విజయ్ సేతుపతి పాత్ర పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని సమాచారం.
ఇక టబు పాత్ర కూడా సీరియస్ న్యాయాధికారిణిగా ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. పూరి తన గత ఫ్లాప్స్ను గుర్తు చేసుకుని ఈసారి కథపై దృష్టి పెట్టాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
“డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడంతో పూరికి ఈ సినిమా చాలా కీలకం. విజయ్ సేతుపతితో తన మాస్ టెంప్లేట్ను కొత్తగా మలచాలని పూరి భావిస్తున్నాడు. బలమైన స్క్రీన్ప్లే, విలక్షణ పాత్రలతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
puri jagannadh, vijay sethupathi, tabu, bollywood actress, new movie update,