తెలంగాణ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు, విచారణ నుంచి సుదీర్ఘకాలంగా తప్పించుకున్న తరువాత, చివరికి సిట్ ముందు హాజరయ్యారు.
నిన్న అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రభాకర్ రావు, ఈరోజు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన విచారణకు మార్గం సుగమమైంది.
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన్ను ఎస్ఐటి అధికారులు కీలకంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాధకిషన్ రావు, భుజంగరావు వంటి పలువురు అరెస్ట్ కావడంతో, వారి వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు సిద్ధం చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారు. దీనితో పాటు ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం, పాస్పోర్ట్ రద్దు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుత విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇది కేసు దిశ మార్చే అంశంగా మారే అవకాశం ఉంది.
ప్రభాకర్ రావు తదుపరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? లేక కోర్టు సూచనలతో ముందుకెళ్లతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.