
ఆంధ్రప్రదేశ్: ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టినప్పటికి ఏడాది పూర్తైంది. జనసేన అధినేతగా మారుమూల గ్రామాల సమస్యలపై గళం విప్పిన పవన్, ఇప్పుడు అధికారంలోనూ అదే తపంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఆయన నడకకు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
‘పల్లె పండుగ’, మినీ గోకులాలు, పంట కుంటలు లాంటి ప్రజలతో కలిసే కార్యక్రమాలతో పవన్ పేరు పల్లెల్లో మారుమోగుతోంది. చిన్నచిన్న మార్పులతో పెద్ద ఫలితాలు తీసుకురావడంలో పవన్ విజయవంతమయ్యారు. కేంద్రంతో సమన్వయం పెంచుతూ రాష్ట్రానికి నిధులు కూడా సమృద్ధిగా రాబట్టారు.
అటవీ భూముల ఆక్రమణలపై పవన్ తీసుకున్న చర్యలు మరింత చర్చకు దారి తీసాయి. మాజీ సీఎం జగన్, పెద్దిరెడ్డి, సజ్జల కుటుంబ భూవివాదాలపై ఆయనే స్వయంగా స్పందించి కేసులు నమోదు చేయించారు. ఇది అధికారాన్ని వినియోగించే విధానంలో పవన్ ప్రత్యేకతను చూపించింది.
ఇక పవన్ తీసుకున్న ప్రతి పథకం కూడా ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. సింప్లిసిటీ, పారదర్శకత, బాధ్యత అనే మూడు విలువలతో ఆయన సాగిన పాలన తరహా భిన్నంగా నిలిచింది.
ఇప్పటివరకు ప్రజలు ఇచ్చిన ఆదరణను గౌరవంగా భావిస్తున్న పవన్, భవిష్యత్తులో మరింత వేగంగా ముందుకు సాగాలని చెప్పుకున్నారు.