
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్టు మేకర్స్ తెలిపారు.
కర్ణాటకలో జరిగిన ఈ షెడ్యూల్లో ఒక పక్కా భారీ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కించినట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ సరికొత్త లుక్తో దర్శనం ఇవ్వబోతున్నారని, అభిమానులు ఇప్పటికే అంచనాల్లో మునిగిపోతున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ ఎంపిక అయ్యిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది మొదట్లోనే ఫినిష్ చేయాలని చూస్తున్నారు.
అయితే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం యూనిట్ నుంచి త్వరలోనే ప్రకటనలు వెలువడనున్నాయి.