
నాగ చైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్లో తెరకెక్కుతున్న NC24 సినిమా థ్రిల్లింగ్ బజ్తో దూసుకెళ్తోంది. ‘తండేల్’ తర్వాత చైతన్య చేస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్.. 10% మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే భారీగా అమ్ముడుపోయాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వామిగా మారి, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను ప్రపంచవ్యాప్తంగా రూ. 30-40 కోట్ల మధ్యలో దక్కించుకున్నట్టు సమాచారం. ఈ డీల్ వల్ల నిర్మాతలకు స్టార్ట్లోనే ఆర్థిక లాభం కలుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ప్రారంభ దశలో ఉన్న సినిమా కావడంతో, విడుదలకు ఇంకా ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అయినా ఇంత పెద్ద డీల్ క్లోజ్ కావడం ఈ సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ‘విరూపాక్ష’ హిట్, ‘తండేల్’ సక్సెస్ ఈ కాంబినేషన్కి ప్లస్గా మారాయి.
చైతన్య ఈ చిత్రంలో ఓ ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నాడు. మిస్టరీ, థ్రిల్లర్, ఎమోషన్స్ మిక్స్ చేసిన కథతో కార్తీక్ దండు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు.