
స్పోర్ట్స్ డెస్క్: MI vs RR: జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ను ఏకపక్షంగా ఓడించింది. 218 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా నిరోధించిన ముంబయి, 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఎంఐ టేబుల్ టాప్లో నిలిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి, ఓపెనర్లు రోహిత్ శర్మ (53), రికెల్టన్ (61) అర్ధశతకాలతో అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (48 నాటౌట్), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (48 నాటౌట్) హరికేన్ ఇన్నింగ్స్తో 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు అందించారు.
బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా తేలిపోయింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ తొందరగా వెనుదిరగడంతో విజయం దూరమైంది. బుమ్రా మొదటి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆటను తనదైన శైలిలో మార్చేశాడు.
ఆపై కర్ణ్ శర్మ (3/23), బౌల్ట్ (3/28) బంతితో రాయల్స్పై విరుచుకుపడ్డారు. జోఫ్రా ఆర్చర్ (30) తప్ప ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు. రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది.
ఈ సీజన్లో ఎనిమిదో ఓటమి మూటగట్టుకున్న రాజస్థాన్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు, ముంబయి వరుసగా ఆరో విజయం నమోదు చేసుకొని బలంగా ముందంజ వేసింది.
mumbai indians, rajasthan royals, ipl 2025, hardik pandya, bumrah bowled out rr,