
భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేళ, భారత స్టార్ క్రికెటర్లు సైనిక బలగాలకు సంఘీభావం ప్రకటించారు. భద్రతా కారణాలతో ఐపీఎల్ 2025 టోర్నీ వారం రోజుల పాటు వాయిదా వేయబడటంతో, ఆటగాళ్లు తమ స్పందన తెలియజేశారు.
విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో, “మన దేశం కోసం సైనికులు, వారి కుటుంబాలు చేస్తున్న త్యాగాలకు మేమెప్పటికీ రుణపడి ఉంటాం” అని రాసారు.
జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా ‘ఎక్స్’ వేదికగా సైనికుల ధైర్యాన్ని కొనియాడారు. “మమ్మల్ని సురక్షితంగా ఉంచే సైన్యం ధైర్యానికి సెల్యూట్” అని బుమ్రా పేర్కొన్నారు.
సూర్యకుమార్ యాదవ్, “సరిహద్దుల్లో సైనికుల బలానికి పెద్ద సెల్యూట్. మీరు కాపాడుతున్నారు కాబట్టే మేము ఇళ్లలో సురక్షితం” అన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో దేశభక్తి పూనకాన్ని రేపుతున్నాయి.
ఇంతకుముందు, రోహిత్ శర్మ కూడా నకిలీ వార్తలను విస్తరించకుండా ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సైనికుల పట్ల గౌరవం వ్యక్తం చేశారు.