
ఆంధ్రప్రదేశ్: ఏపీ టెక్ రంగానికి మరొక బలం చేకూరింది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్, విశాఖపట్నం కాపులుప్పాడలో సరికొత్త టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాగ్నిజెంట్ సంస్థకు హర్షభావంతో స్వాగతం తెలిపారు. కాగ్నిజెంట్ రాకతో రాష్ట్ర యువతకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్ర యువతలో ఉన్న ప్రతిభ, టెక్నికల్ నైపుణ్యం ప్రపంచాన్ని ఆకట్టుకునేలా ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ క్యాంపస్తో టెక్ ఆవిష్కరణలు, ప్రతిభ, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు వేదిక సిద్ధమవుతుందని అభిప్రాయపడ్డారు.
విశాఖ నగరానికి ఇది గొప్ప అవకాశంగా మారనుందని తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి కాగ్నిజెంట్ సహాయపడుతుందని పేర్కొన్నారు.
ఈ క్యాంపస్ వల్ల స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని, రాష్ట్రానికి కొత్త టెక్నాలజీ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని సీఎం వెల్లడించారు.
ఆర్థిక నిపుణులు కూడా ఈ పెట్టుబడి ద్వారా విశాఖపట్నం దేశవ్యాప్తంగా కీలక టెక్ కేంద్రంగా ఎదుగుతుందని అభిప్రాయపడుతున్నారు.