బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట విషాదం నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. “కేఎస్సీఏ అధికారుల ఆహ్వానంతోనే హాజరయ్యాను” అంటూ స్పష్టం చేశారు.
విలేకరులతో మాట్లాడుతూ, “మేమే ఈ ఈవెంట్ నిర్వహించలేదని… ఆహ్వానితులమని” ఆయన అన్నారు. గవర్నర్ కూడా వస్తున్నారని చెప్పడంతో వెళ్లానని వివరించారు. స్టేడియంకు కాదు, విధానసౌధ వద్ద నిర్వహించిన సమావేశానికి వెళ్లినట్లు తెలిపారు.
ఈ వీఐపీ రాకతో పోలీస్ బలగాలు విభజించాల్సి రావడంతో భద్రతా లోపం ఏర్పడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది గాయపడ్డారు.
బీజేపీ దీనిపై తీవ్ర విమర్శలు చేస్తూ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్లే బాధ్యులని ఆరోపిస్తోంది. పోలీసులు బలిపశువులు అవుతున్నారని ప్రతిపక్షం మండిపడుతోంది. ముగ్గురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తు జరుపుతుండగా, డీఎన్ఏ ఈవెంట్ సిబ్బంది సహా నలుగురిని అరెస్ట్ చేశారు. మొదట హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశాలు జారీయ్యాయి.
ఐపీఎల్ తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఆనందాన్ని ఈ ఘటన మసకబార్చింది. ఉచిత ప్రవేశంతో లక్షల మంది దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది.
rcb stampede, siddaramaiah response, bengaluru tragedy, ksca event, cid investigation,