
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ పై అనేక వార్తలు వస్తుండగా, మేకర్స్ వాటికి చెక్ పెట్టారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలను రేపింది.
తాజాగా ఈ సినిమా రీషూట్స్లో ఉందని, వాయిదా పడనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలన్నీ అవాస్తవమని మేకర్స్ స్పష్టం చేశారు. “తుఫాన్కు ముందు నిశ్శబ్దం లాగానే సినిమాకు సిద్ధంగా చేస్తున్నాం” అంటూ వారు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తోంది. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తుండగా, మ్యూజిక్ కోసం అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
కింగ్డమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. సినిమా టెక్నికల్ పరంగా కూడా భారీగా ఉండబోతుందని యూనిట్ టాక్.
వార్తలు ఎంతవైనా వచ్చినా, కింగ్డమ్ చిత్రం టైమ్కు రెడీ అవుతుందన్న స్పష్టతతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
vijaydeverakonda, kingdom, gauthamtinnanuri, anirudh, sitaraentertainments,