
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సెహ్వాగ్ తన ‘జింక్స్’ సెంటిమెంట్ను ఆధారంగా చేసుకుని ఆర్సీబీనే విజేత అవుతుందని జోస్యం చెప్పారు. “నేను మద్దతిచ్చిన జట్టే ఓడిపోతోంది. కాబట్టి ఇప్పుడు నేను ఆర్సీబీకి మద్దతు ఇస్తున్నా. అంటే ఆ జట్టు గెలుస్తుంది,” అంటూ సెహ్వాగ్ పేర్కొన్నారు.
క్రిక్బజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత మ్యాచ్లను ఉదహరించారు. క్వాలిఫైయర్-1లో పంజాబ్ ఓడిందని, క్వాలిఫైయర్-2లో ముంబైను మద్దతిచ్చి తన జింక్స్ అమలైనదని వివరించారు.
ఇప్పటివరకు ఆర్సీబీ 3 సార్లు ఫైనల్కి చేరినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. పంజాబ్ కింగ్స్ మాత్రం 2014లో ఒక్కసారి ఫైనల్ ఆడింది. అంటే ఈసారి ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ అవుతారు.
ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ 600+ పరుగులతో ఫామ్లో ఉన్నాడు. పంజాబ్ తరఫున కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్వాలిఫైయర్-2లో 87* పరుగులతో మ్యాచు విన్నర్ అయ్యాడు. ఈ సీజన్ ముగింపు మ్యాచ్కి ముందు సెహ్వాగ్ జోస్యం నిజం అవుతుందా లేదా చూడాలి.