
ఏపీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయారని, రాజీనామా వ్యవహారం వెనుక రాజకీయ ఒప్పందాలే కారణమని మండిపడ్డారు.
“విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనలకు విలువేంటి? ఆయన చంద్రబాబు కూటమికి లబ్ధి కలిగించేలా తన పదవిని తాకట్టు పెట్టారు” అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇంకా మూడున్నర సంవత్సరాల పదవీకాలం మిగిలినా, రాజకీయ లాభసాటికోసం రాజీనామా చేయడం అనైతికమని ఆరోపించారు.
రాజ్యసభలో వైసీపీకి తగిన మెజారిటీ లేకపోవడంతో, మళ్లీ ఆయనకు ఛాన్స్ రావడం కష్టమన్నదే అసలు విషయం అని అన్నారు. దీంతో ఆయన చంద్రబాబు కూటమికి సేవలందించేందుకు పదవిని తాకట్టు పెట్టారని జగన్ విమర్శించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలకు విలువ లేదని జగన్ స్పష్టం చేశారు. ప్రజలకు గందరగోళం కలిగించేందుకే ఈ రాజకీయ నాటకాలు సాగుతున్నాయని ఎద్దేవా చేశారు.