
స్పోర్ట్స్ డెస్క్: DC vs MI: ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయంచేసుకుంది. దిల్లీ క్యాపిటల్స్పై 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 4లో స్థానం సంపాదించింది.
వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ కీలక మ్యాచ్లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 180/5 స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73*; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు) ఫైర్గా ఆడగా, నమన్ ధీర్ (24*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఫినిష్ ఇచ్చాడు.
రికెల్టన్ (25), తిలక్ వర్మ (27), జాక్స్ (21) మెరుగైన ఇన్నింగ్స్లు ఆడారు. చివరి రెండు ఓవర్లలో 48 పరుగులు రావడం మ్యాచును ముంబయి వైపు తిప్పింది.
దిల్లీ 121 పరుగులకు ఆలౌటైంది. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ (20) మినహా ఎవరూ నిలబడలేకపోయారు. బుమ్రా, శాంట్నర్ చెరో మూడు వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ పాండ్యా ఒక్కో వికెట్ తీసి దిల్లీని కట్టడి చేశారు.
ఈ విజయంతో ముంబయి 13 మ్యాచ్లలో ఎనిమిది గెలుపులతో ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. దిల్లీ మాత్రం ఇంటి ముఖం పట్టింది.
MI vs DC, Suryakumar Yadav, Mumbai Playoffs, IPL 2025, Delhi Capitals Exit,