
స్పోర్ట్స్ డెస్క్: CSK vs RR: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 187/8 పరుగులు చేసింది. వాటిలో ఆయుష్ మాత్రే (43), బ్రెవిస్ (42), శివమ్ దూబె (39) రాణించగా, ఉర్విల్, జడేజా, ధోనీ నిరాశపరిచారు.
రాజస్థాన్ బౌలర్లలో యుధ్విర్ సింగ్, మధ్వాల్ చెరో మూడు వికెట్లు తీసి కీలకంగా నిలిచారు. లక్ష్యఛేదనలో రాజస్థాన్ వైభవ్ సూర్యవంశీ (57), సంజు శాంసన్ (41), జైస్వాల్ (36) కలిసి మ్యాచును శాసించారు.
చివర్లో జురెల్ (31*) & హెట్మయర్ (12*) పవర్ఫుల్ ఫినిషింగ్తో 17.1 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించారు. చెన్నై బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీసినప్పటికీ మిగిలిన బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు.
ఈ సీజన్లో రాజస్థాన్ 14 మ్యాచ్ల్లో 4 విజయాలతో తమ ప్రయాణాన్ని ముగించింది. చెన్నైకి ఇది 10వ ఓటమి కాగా, ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ప్లేఆఫ్ ఆశలు ముగిసిన ఈ రెండు జట్లకు ఇది గౌరవ పరమైన పోరాటంగా నిలిచింది.