
స్పోర్ట్స్ డెస్క్: విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటనతో భారత క్రికెట్లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. కోహ్లీ ఇలా అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటించడం అభిమానులతో పాటు బీసీసీఐకి కూడా షాకే.
గత కొద్ది నెలలుగా టెస్ట్ రిటైర్మెంట్ పుకార్లు వినిపిస్తున్నా, బోర్డు చివరి వరకూ ఈ నిర్ణయాన్ని ఆపేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ దృష్ట్యా, బీసీసీఐ కోహ్లీని కన్విన్స్ చేయాలని భావించింది.
అయితే, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్న కోహ్లీ, తన నిర్ణయంలో తొలగిపోలేదు. ఇప్పటికే ఇద్దరు పిల్లల తండ్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన కోహ్లీ, కెరీర్కు గౌరవంగా ముగింపు ఇచ్చాడు. అతని రిటైర్మెంట్ ముందు రోజు బీసీసీఐ సీనియర్ సభ్యులు పర్సనల్గా కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది.
కోహ్లీ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే – 123 మ్యాచ్లు, 9,230 పరుగులు, 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు అతని నిలకడైన ప్రతిభను సూచిస్తాయి. అతని సగటు 49.29. విదేశాల్లో చేసిన సెంచరీలు, కీలక సిరీస్లలో చేసిన ఇన్నింగ్స్లు అభిమానుల్లో చెరగని ముద్ర వేశాయి.
ఇక రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఒకేసారి టెస్ట్కు గుడ్బై చెప్పడంతో భారత జట్టుకు అనుభవ లోటు తలెత్తుతుంది. ఇది యువ ఆటగాళ్లకు అవకాశం అయినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్ స్పెషలిస్ట్గా స్థిరపడటం మాత్రం అంత తేలిక కాదు.
బీసీసీఐ ఇప్పట్లో నూతన నాయకత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కోహ్లీ స్థాయిని భర్తీ చేయడం మాత్రం చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.