
బిజినెస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లను ఉత్సాహంగా మార్చింది. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో భారత మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల యుద్ధం ప్రభావం మన మార్కెట్లపై లేకపోవడం హైలైట్గా నిలిచింది.
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,310 పాయింట్లు పుంజుకొని 75,157 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 429 పాయింట్ల లాభంతో 22,828 మార్క్ను అధిగమించింది. రూపాయి మారకం విలువ డాలరుతో రూ.86.05గా నమోదైంది.
బీఎస్ఈలో టాటా స్టీల్ (4.91%) అగ్రగామిగా నిలవగా, పవర్ గ్రిడ్ (3.72%), ఎన్టీపీసీ (3.25%), కోటక్ బ్యాంక్ (2.85%), రిలయన్స్ (2.84%) టాప్ గెయినర్లుగా నిలిచాయి. మెటల్, పవర్, ఫైనాన్స్ రంగాలు మార్కెట్ను లీడ్ చేశాయి.
మరోవైపు, ఏషియన్ పెయింట్స్ (-0.76%), టీసీఎస్ (-0.43%) లాంటి కంపెనీలు స్వల్ప నష్టాలు చూశాయి. ఐటీ రంగం మిశ్రమ ట్రెండ్ను చూపించింది.
మొత్తానికి ట్రంప్ ప్రకటన దేశీయ మార్కెట్లలో సానుకూలతను రేకెత్తించింది. సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో లాభపడటంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.