
తెలంగాణ: ఇకపై ఇంటర్, డిగ్రీలో బీసీలకు ఎగ్జామ్ లేని అడ్మిషన్లు
తెలంగాణ బీసీ గురుకులాల్లో ప్రవేశాల్లో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రవేశ పరీక్షలకు గుడ్బై
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ (Backward Classes) విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే మహాత్మ జ్యోతిబా ఫూలే (Mahatma Jyotiba Phule) బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ (Entrance Exam) లేకుండానే అడ్మిషన్లు (Admissions) జరగనున్నాయి.
మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ
ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త విధానం అమలులోకి రానుంది. పదో తరగతిలో (10th Class) వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్ (Intermediate) సీట్లను భర్తీ చేయనున్నారు. అలాగే ఇంటర్లో వచ్చిన మార్కులు, మెరిట్ (Merit) ఆధారంగా డిగ్రీ (Degree) సీట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించబడుతున్నాయి.
25,000 సీట్లకు ఎగ్జామ్ అవసరం లేదు
మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 261 ఇంటర్ కళాశాలలు, 33 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో కలిపి దాదాపు 25,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లన్నింటినీ పూర్తిగా మెరిట్ ఆధారంగా మాత్రమే భర్తీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఎంట్రన్స్కు ఫుల్స్టాప్
ఇప్పటి వరకు రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించేవారు. కానీ ఆ విధానానికి ఇక పూర్తిగా గుడ్బై చెప్పింది సొసైటీ. విద్యార్థులపై భారం తగ్గించడంతో పాటు, మెరిట్ ప్రాధాన్యతను పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
ఇంటర్ మరియు డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియను త్వరలో ఈ విద్యా సంత్సరం నుండే అధికారికంగా ప్రారంభించనున్నారు. అభ్యర్థులు తమ అకడమిక్ మెరిట్ ఆధారంగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశముంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు (Guidelines) కూడా త్వరలో విడుదల కానున్నాయి.