
తమిళనాడు: కరూర్లో విజయ్ నిర్వహించిన టీవీకే ర్యాలీ పెద్ద విషాదానికి కారణమైంది. ఈ తొక్కిసలాటలో 30 మందికి పైగా గాయపడటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
టీవీకే పార్టీ మాత్రం ఈ ఘటన వెనుక కుట్ర ఉందని ఆరోపించింది. విజయ్ ర్యాలీకి వచ్చిన వెంటనే విద్యుత్తు నిలిచిపోవడంతో అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని పేర్కొంది.
అయితే, విద్యుత్ బోర్డు మాత్రం వేరే వర్షన్ చెప్పింది. టీవీకే పార్టీనే విద్యుత్తు నిలిపివేయమని లేఖ పంపిందని, కానీ తాము నిరాకరించామని చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి తెలిపారు.
ప్రజల భద్రత దృష్ట్యా విద్యుత్ నిలిపివేయాలని కోరారని, అయితే అది సాధ్యం కాదని తిరస్కరించామని స్పష్టం చేశారు. దీంతో ఆరోపణలపై కొత్త చర్చ మొదలైంది.
తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. ర్యాలీ వేదిక వద్ద కరెంట్ కోత జరగలేదని, టీవీకే ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా లైట్లు మసకబారాయని తెలిపింది.
మొత్తానికి ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ వాదనలకు కొత్త ఇంధనం అందించింది. విచారణలో నిజం ఏంటో బయటపడే వరకు వివాదం కొనసాగేలా ఉంది.
