
తెలంగాణ: రాష్ట్రంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శాఖల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి కీలక శాఖలను అప్పగించడం విశేషంగా మారింది.
అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. సామాజిక న్యాయం పరిరక్షణకు వీరి పాత్ర కీలకమవనుంది. గడ్డం వివేక్కు కార్మిక శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో ఈ శాఖలు ముఖ్యమైనవి.
ఇక వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖల బాధ్యతలు అప్పగించబడ్డాయి. యువత అభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో ఈ శాఖలు కీలక పాత్ర పోషిస్తాయి. వారిని యాక్టివ్ పాత్రలో కనిపించే అవకాశముంది.
ఈ మంత్రుల నియామకంతో తెలంగాణ కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండానే కొత్త మంత్రులకు శాఖలు అప్పగించడంపై విశేష చర్చ సాగుతోంది.