
చెన్నై: తమిళనాడు డ్రగ్స్ కేసు (TAMILNADU DRUG CASE) విషయంలో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కుమారుడు అలీఖాన్ తుగ్లక్ డ్రగ్స్ విక్రయం, వినియోగం కేసులో అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు అరెస్ట్ చేసిన అలీఖాన్ తుగ్లక్తో పాటు అతని నెట్వర్క్లో మొత్తం పదిమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
చెన్నై నగరంలోని ప్రముఖ కాలేజీ విద్యార్థుల నుంచి లభించిన సమాచారంతో ఈ కేసు బహిర్గతమైంది.
అలీఖాన్ తుగ్లక్ గంజాయి, మెథాంఫెటమిన్ వంటి మాదక ద్రవ్యాలను ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలు చేసి చెన్నైలో విక్రయించడమే కాకుండా వినియోగించినట్లు పోలీసులు నిర్ధారించారు.
అతని ఫోన్ నుంచి కీలక ఆధారాలు లభించాయి, వీటితో కేసుకు మరింత బలం చేకూరింది.
మన్సూర్ అలీఖాన్ వివాదస్పద వ్యాఖ్యలతో ఇప్పటికే వార్తల్లో నిలిచినప్పటికీ, ఇప్పుడు ఆయన కుమారుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం సినీ ఇండస్ట్రీపై చెడు ప్రభావాన్ని చూపిస్తోంది.
సినిమా రంగానికి చెందిన వ్యక్తి డ్రగ్స్ విక్రయానికి కేంద్రబిందువుగా మారడం ఇండస్ట్రీ ప్రతిష్ఠను దెబ్బతీసే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అరెస్టైన వారిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఈ కేసు ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా నెట్వర్క్పై మరింత దృష్టి పెట్టేలా చేస్తోంది.